జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీసులతో 33వ వార్డులో మీతో మీ కార్పొరేటర్ అనే కార్యక్రమంలో భాగంగా గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్ట వాస్తవ్యులు కంచుమోజు లక్ష్మీ గత కొన్ని నెలలుగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నట్లు జనసేన 33వ కార్పొరేటర్ మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ అయిన భీశెట్టి వసంతలక్ష్మి దృష్టికి రావడంతో, జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపీకృష్ణ(జీకే ), జీకే ఫౌండేషన్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెల ₹1000 అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఈనెల 27వ చెక్కు అందించడం జరిగింది (27*1000=27,000/-) కావున సహాయం చేయాలి అనుకునే దాతలు ముందుకు వచ్చి ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలి అని కోరుకుంటున్నాం.
