Tv424x7
Andhrapradesh

4వేల లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

విశాఖపట్నం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ ఎస్సై పి. రాజారావు, సిబ్బంది బుధవారం నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, రోలుగుంట మండలం సరిహద్దులో నాటు సారా తయారీకి సంబంధించిన స్థావరాలపై నమ్మకమైన సమాచారంతో మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీకి ఉపయోగించే పులుపు సుమారు 4 వేల లీటర్లను ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా నాటు సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం సీఐ రేవతమ్మ మాట్లాడుతూ ఎక్కడైనా నాటుసారా తయారీ గాని అమ్మకాలు గాని, అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.

Related posts

సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

TV4-24X7 News

నేషనల్ హెరాల్డ్ కేసుపై వైఎస్ షర్మిల రియాక్షన్

TV4-24X7 News

సూరాడా సత్తయ్య 2వ వర్ధంతి కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment