విశాఖపట్నం వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం లక్ష్మీ టాకీస్ సమీపంలో గలశెట్టిబలిజ సామాజిక భవనంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారభమైంది.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ జి.దేముడు బాబు ముఖ్య అతిధిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనిర్వహించిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.జర్నలిస్టులు సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం హర్షణీయం అన్నారు.శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం మాట్లాడుతూ అందరికి ఉపయోగపడే కార్యక్రమాన్ని జర్నలిస్టులు ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు.వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు కీర్తన్, అర్జున్, సురేష్, సతీష్,లు మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిందన్నారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ అసోసియేషన్ ఈ ఐ క్యాంప్ ను నిర్వహిచినట్లు చెప్పారు.శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.సుమారు రెండు వందల మంది కి పై ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

previous post
next post