ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్ఆంధ్రప్రదేశ్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను ఫోన్ ద్వారా పరామర్శించారు. గుడివాడలో జరిగిన దాడి ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై తనకు చాలా బాధగా ఉందని, మీరు ధైర్యంగా ఉండాలని హారికకు జగన్ సూచించారు. పార్టీ తరఫున పూర్తిగా మద్దతుగా ఉన్నామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. దాడి చేసినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

