Tv424x7
Andhrapradesh

జమ్మలమడుగులో వినాయక లడ్డూ పై వైఎస్ జగన్ పేరు ప్రతిష్టాత్మకం..

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూ వేలం పోటీ ఘనంగా జరిగింది. ఈ వేలంలో లడ్డూ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.

తరువాత, ఈరోజు తాడేపల్లి కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు శ్రీ వల్లంబాయి హృషికేశ్వర రెడ్డి గారు తన మిత్రబృందం ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలుసుకొని లడ్డూ ప్రసాదాన్ని అందించారు.

ఈ సందర్భంగా హృషికేశ్వర రెడ్డి గారు, వినాయకుడి కృపతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ముఖ్యమంత్రి జగన్ ప్రజా సేవలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related posts

అన్నదమ్ముల మధ్య ఆస్తి రగడ…. చివరికి ఇలా…

TV4-24X7 News

మా ఆకలి కేకలు మీకు కనపడవా ~ ఆటో కార్మికులు నిరసన

TV4-24X7 News

: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment