ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు కుప్పకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
👉 కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా కిలో రూ.2కే అమ్ముడైంది.
👉 నంద్యాల, మదనపల్లెల్లో రూ.3 నుంచి రూ.10 వరకే పలికింది
.👉 కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్వింటా ధర కేవలం రూ.150 మాత్రమే.
తమ కష్టానికి సరైన ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్కి తీసుకెళ్ళినా కూలీ ఖర్చులు కూడా రాకపోవడం వల్ల నష్టాలు తప్పట్లేదని వారు వాపోతున్నారు.
రైతుల ఆశ – ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఉపశమన చర్యలు చేపట్టాలి
అనూష

