న్యూఢిల్లీ:
ఈ రోజు ఉదయం 10 గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారతదేశ 14వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.
మంగళవారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ తన ప్రత్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

