నిజామాబాద్ జిల్లా బోధన్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. బ్యాంకులో ఉన్న రూ.5 లక్షల నగదును కేవలం 12 ఏళ్ల బాలుడు దొంగిలించాడు.
ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకు ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
చిన్నారి చేతిలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వెళ్లిపోవడం స్థానికులను విస్తుపోయేలా చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బాలుడి కదలికలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు.

