తక్కువ ప్రీమియంతో భవిష్యత్తు భద్రతను అందించే పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ స్కీమ్లపై ఆసక్తి పెరుగుతోంది. ఈ పథకంలో, నెలకు కేవలం రూ.175 చెల్లిస్తే లక్ష రూపాయల పాలసీ పొందవచ్చని అధికారులు తెలిపారు.
మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.3.70 లక్షలు లభించవచ్చని, అలాగే బోనస్, లోన్ సదుపాయం, నామినీ సౌకర్యం, టాక్స్ మినహాయింపు (సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు) లభిస్తాయని అధికారులు వివరించారు.
ఈ పాలసీ కోసం 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయస్సు గలవారే అర్హత పొందుతారు. తక్కువ ఖర్చుతో భవిష్యత్తులో భారీ లాభాలను పొందడానికి ఇది ఒక మంచి అవకాశం అని అధికారులు సూచిస్తున్నారు.

