నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) UPI లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, ఒక్కో ట్రాన్సాక్షన్లో రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు. ఒక రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు.

