దోర్నాల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నరసరావుపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే స్థానిక దోర్నాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కుటుంబం శ్రీశైలం దైవదర్శనం ముగించుకొని నరసరావుపేటకు తిరుగు ప్రయాణం అవుతుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

