ప్రియుడి మోజులో పడి.. వాడి మాట విని.. కన్న బిడ్డను సరస్సులో పడేసిన తల్లి
రాజస్థాన్లోని అజ్మీర్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ కన్నతల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడు మాటలు విని సరస్సులో పడేసింది.
నగర శివారులోని అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం కనిపించింది.
మృతదేహాన్ని బయటకు తీయించిన క్రిస్టియన్ గంజ్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాపనీ కన్న తల్లే పడేసింది అని నిర్ధారణ చేసుకొని ..అంజలీసింగ్ను అదుపులోకి తీసుకున్నారు.

