దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుకు ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఈ నెల 30వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
విశ్లేషకుల అంచనా ప్రకారం, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో కొత్త ఓటర్ల పేర్ల నమోదు, అవసరంలేని పేర్ల తొలగింపు, సవరణలు, మార్పులు చేపట్టనున్నారు.
ఇప్పటికే బిహార్లో ఎస్ఐఆర్ అమలు ప్రారంభమైంది. అయితే అక్కడ ప్రతిపక్షాలు ఈ ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసి నిరసనలకు దిగాయి.
ఎన్నికల సంఘం సూచనల మేరకు, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఈ నెలాఖరుకల్లా ఫీల్డ్ స్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంది.

