అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ Airbus కంపెనీకి ప్రతిపాదించారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ఢిల్లీలో జరిగిన Airbus బోర్డు సమావేశంలో పాల్గొన్న మంత్రి, సంస్థ ప్రతినిధులను రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు.
లోకేష్ మాట్లాడుతూ, ఏపీ అన్ని రకాల సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉందని, Airbus కోసం రాష్ట్రం గోల్డ్ స్టాండర్డ్ వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో అధునాతన ఏరోస్పేస్ పరిశ్రమకు దోహదం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

