విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం దసరా రోజున నిర్వహించే తెప్పోత్సవం ఈ ఏడాది కూడా రద్దయింది.
కృష్ణా నదిలో వరదనీరు భారీగా చేరడంతో, భద్రతా కారణాల దృష్ట్యా నీటిపారుదల శాఖ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
గత రెండు సంవత్సరాల్లోనూ (2022, 2023) దసరా రోజు వర్షాల కారణంగా తెప్పోత్సవం జరగలేదు. ఈసారి వరదల నేపథ్యంలో భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు, దసరా ఉత్సవాల భాగంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది.
👉 భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతున్నారు.

