ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల విరాళం ఇస్తా..! — పాత్లవత్ నూరియా నాయక్
రంగారెడ్డి జిల్లా ఫరక్నగర్ మండలం గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రామానికి చెందిన రైతు పాత్లవత్ నూరియా నాయక్ తనను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.
గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 550 మంది ఓటర్లు ఉండగా, రిజర్వేషన్ ఖరారైన వెంటనే నూరియా నాయక్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినవాడిని కాదని, కేవలం గ్రామాభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు.
గిరయ్యగుట్ట, నా గర్లగడ్డ తండాలను అభివృద్ధి చేయడం తన కర్తవ్యమని స్పష్టం చేసిన నూరియా నాయక్ ఆఫర్పై గ్రామస్థులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రజలు ఏకగ్రీవానికి ఒప్పుకుంటారా, లేక పోటీ దారులు రంగంలోకి దిగుతారా అన్నది చూడాలి.

