మైదుకూరు: ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై దాడి జరిగిన ఘటనకు నిరసనగా మైదుకూరు డిపోకు చెందిన డ్రైవర్లు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, సీఐ రమణారెడ్డి డ్రైవర్లతో సమావేశమై చర్చలు జరిపారు. ఇటువంటి ఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిరసన విరమించాలని డ్రైవర్లను కోరారు.
previous post

