వివరణ:
ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గుత్తికోయ గూడెంలో శుక్రవారం అటవీ అధికారులు, గుత్తికోయలు మధ్య వాగ్వాదం జరిగింది. రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుడిసెలు వేయాలని ప్రయత్నించిన గుత్తికోయలను అధికారులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో, సురేష్ అనే యువకుడు అటవీ అధికారుల జీపును అడ్డుకుని, దానిపైకి ఎక్కి గొడవకు దిగాడు.
తర్వాత విసుగుతో పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం సురేష్ ను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

