ప్రకాశం జిల్లా: మార్కాపురం–కుంట మధ్య రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పుకుంది.
మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది.
డ్రైవర్ సమయస్ఫూర్తిగా బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా అల్లకల్లోలానికి గురయ్యారు.
సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

