Tv424x7
Andhrapradesh

తల్లిని చంపిన కేసులో తనయుడి అరెస్టు– కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ నాగరాజు

అనంతపురం :కంబదూరు మండలం వైసీపల్లి గ్రామానికి చెందిన సుంకమ్మను చంపిన ఆమె తనయుడు వెంకటేశులును అరెస్టు చేశామని కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ నాగరాజు తెలిపారు. కంబదూరు ఎస్సై ఆంజనేయులతో కలిసి సి.ఐ వెల్లడించిన వివరాలు… సుంకమ్మ, రామదాసు దంపతులకు కొడుకు వెంకటేశులు ఉన్నాడన్నారు. ఇతను అనంతపురంలో ఉంటాడు. వీరికున్న స్థలం విషయంలో తల్లి, తండ్రి గొడవపడ్డారన్నారు. తల్లి కట్టెతో తండ్రిని కొట్టిందని… ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ అనంతపురం నుండీ వైసిపల్లికి వెళ్లి తండ్రిని ఎందుకు కొట్టావంటూ నిలదీశాడని సి.ఐ చెప్పారు. తల్లి ఎదురు చెప్పడంతో వెంకటేష్ కోపంతో సుంకమ్మ తలను గ్యాస్ బండకు గుద్దడంతో చనిపోయిందని సి.ఐ తెలిపారు. ఆమె భర్త రామదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడైన వెంకటేశులును అరెస్టు చేశామన్నారు.

Related posts

2025 వక్ఫ్ బోర్డు సవరణ చట్ట వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

TV4-24X7 News

ఏపీలో ఇకపై ఇద్దరికి మించి పిల్లలున్న వారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే

TV4-24X7 News

బాలికపై లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

TV4-24X7 News

Leave a Comment