యువ సేవ ఫౌండేషన్ చొరవ
విశాఖపట్నం అత్యవసర వేళ అందర్నీ ఆదుకుంటున్న యువ సేవ ఫౌండేషన్. జ్ఞానాపురంలోని శ్మశాన వాటిక కాపర్లకు టీ-షర్టులు పంపిణీ చేసింది. జీవీఎంసీ శానిటరీ ఇన్స్ పెక్టర్ జి. ప్రసన్న సహకారంతో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పీలా హరి ప్రసాద్ చేతుల మీదుగా 20మంది కాపర్లకు శుక్రవారం వీటిని పంపిణీ చేశారు. కైలాసభూమిలో ఏక రూపు దుస్తులతో అంతా ఒకేలా కనిపించాలని కాపర్లు చేసిన విజ్ఞప్తికి స్పందించి తామలా చేశామని హరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అవయవ దానంపై అందరిలోనూ చ్కెతన్యం రావాలని, విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

