Tv424x7
PoliticalTelangana

విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉంది.. సీఎండీపై చర్యలు తీసుకోవచ్చా?: రేవంత్ రెడ్డి

🟦విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం.

.🟦నేడు జరగనున్న సమీక్షకు సీఎండీలను పిలవాలని సూచన.

.🟦అధికారులు సమర్థవంతంగా పని చేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిక..

🟦రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని… విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జరగనున్న సమీక్షకు సీఎండీలను కూడా పిలవాలని ఆదేశించారు. సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దన్నారు. ఆరు గ్యారెంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారుల పని తీరు ఉండాలని సూచించారు. అధికారులు సమర్థవంతంగా పని చేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

Related posts

షాద్‌నగర్‌లో రేపు విద్యుత్ నిలిపివేత!!

TV4-24X7 News

రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

TV4-24X7 News

రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment