రేపు (17.09.2025, బుధవారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు షాద్నగర్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడనుంది.
220/132/33kV సబ్స్టేషన్లో మరమ్మతు పనులు చేపట్టనున్న కారణంగా షాద్నగర్లోని అన్ని కాలనీలు, ఫారూక్నగర్, నాగులపల్లి, రాసమల్లగుడేము, సొలిపూర్, సాయిబాలాజీ టౌన్షిప్ గ్రామాల్లో మూడు గంటలపాటు కరెంట్ ఉండదు.
ఈ అసౌకర్యానికి వినియోగదారులు సహకరించాలని TGSPDCL షాద్నగర్ ఏఈ విజ్ఞప్తి చేశారు.

