Tv424x7
AndhrapradeshTelangana

కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం జలాశయానికి వరద

శ్రీశైలం: నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కు వరద పోటెత్తింది. వరద ప్రవాహం మొదలైన 8 గంటల్లోనే నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాత్రి 7 గంటలకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది.

Related posts

15 రోజుల అనంతరం రేపు రాష్ట్రానికి తిరిగి రానున్న జగన్

TV4-24X7 News

పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

TV4-24X7 News

ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

TV4-24X7 News

Leave a Comment