హైదరాబాద్ శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారిన, రూ.40 లక్షల దారి దోపిడీ కేసులో నిందితులను పోలీసులు స్వల్ప వ్యవధిలోనే పట్టుకోవడం కలకలం రేపుతోంది.
🔸 స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ డ్రైవర్ మధునే ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు.
🔸 వ్యాపారి డబ్బు వసూలు చేయడానికి వికారాబాద్కు పంపిన మధు, సహాయకుడు సాయిబాబా దగ్గరే ప్లాన్ మార్చి స్నేహితులతో కలిసి దోపిడీ జరిపించాడు.
🔸 మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
🔸 దోపిడీకి ఉపయోగించిన వాహనం, సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను పట్టుకున్న శంకర్పల్లి పోలీసులు తమ చాకచక్యాన్ని మరోసారి చాటారు.
అనూష

