తెలంగాణలో ఫిరాయింపు వ్యవహారంపై రాజకీయ తుపాను కొనసాగుతుండగా, సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ నోటీసులు పంపారు.
🟣 సమాధానమిచ్చిన ఎమ్మెల్యేలు (8 మంది):
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
అరెకపూడి గాంధీ
సంజయ్
గూడెం మహిపాల్ రెడ్డి
పోచారం శ్రీనివాస్ రెడ్డి
ప్రకాశ్ గౌడ్
కాలె యాదయ్య
తెల్లం వెంకట్రావు
👉 ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లిఖితపూర్వక వివరణలు సమర్పించారు.
🟣 ఇంకా సమయం కోరిన ఎమ్మెల్యేలు:
కడియం శ్రీహరి
దానం నాగేందర్
🟢 ఎమ్మెల్యేల ప్రధాన వివరణ:
“మేము పార్టీ మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే”
“బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు, రాజీనామా చేయలేదు”
“అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాం”

