హైదరాబాద్లో మరోసారి సైబర్ మోసం బహిర్గతమైంది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమంటూ నమ్మబలికిన కేటుగాళ్లు ముగ్గురి నుంచి వేర్వేరుగా భారీ మొత్తాలను దోచుకున్నారు.
వాట్సప్ ద్వారా పరిచయం అయ్యి, తమ యాప్, వెబ్సైట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి మొత్తం రూ.4.39 కోట్లు ఎత్తుకుపోయారు.
మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు హెచ్చరిక: “ఇలాంటి పెట్టుబడుల మెసేజ్లు, తెలియని యాప్లు, వెబ్సైట్లను నమ్మవద్దు. అధికారిక ఆర్థిక సంస్థల ద్వారానే లావాదేవీలు జరపండి.”

