అస్సాం రాష్ట్రంలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో భూ కుంభకోణానికి సంబంధించి పోలీసులు నుపుర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఇంటి నుండి రూ.90 లక్షల నగదు, రూ.1 కోటి పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం అయ్యాయి.
ఈ సంఘటనతో అస్సాం పరిపాలనా వర్గాల్లో కలకలం రేగింది. అధికారులు మరిన్ని ఆస్తుల వివరాలు, సంబంధిత వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

