ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసు సిబ్బందికి కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా కట్టుదిట్టంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. గంజాయి రవాణా, పేకాట, కోడి పందాలు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.

