వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
ఫిమేల్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న జ్యోతి అనే రోగికి O+ బ్లడ్ అవసరం ఉండగా, వైద్యులు పొరపాటున B+ బ్లడ్ ఎక్కించారు.
దీంతో జ్యోతి పరిస్థితి విషమించగా, గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
ఈ ఘటనపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది అలసత్వమే దీనికి కారణమని ఆరోపిస్తూ మండిపడుతున్నారు.
👉 ఆస్పత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం వరుసగా జరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

