భారతదేశ రాజకీయాల్లో వారసత్వ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో దాదాపు 21 శాతం మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినవారేనని అధ్యయనం తేల్చింది.
లోక్సభలోనే ప్రస్తుతం 31% మంది ఎంపీలు రాజకీయ కుటుంబాలకు చెందినవారు కాగా, రాష్ట్ర శాసనసభల్లో సగటున 20% మంది అలాంటి వారేనని నివేదిక పేర్కొంది. మొత్తం 5,204 మంది ప్రజాప్రతినిధులలో 1,107 మంది రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టు తేలింది.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్లో 23%, రాజస్థాన్లో 18%, బీహార్లో 27%, మహారాష్ట్రలో 32% మంది వారసులు అధికారంలో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 34% తో అగ్రస్థానంలో ఉండగా, కర్నాటకలో 29% మంది వారసులే రాజకీయ ప్రతినిధులుగా ఉన్నారు.
ఏడీఆర్ నివేదికలో ఈ తరహా ధోరణి ప్రజాస్వామ్యానికి సవాల్గా మారిందని, ప్రజా ప్రతినిధుల ఎంపికలో కుటుంబ సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేసింది.

