విజయవాడలోని BRTS రోడ్డుపై ఫుడ్ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి పెద్ద హంగామా జరిగింది.
ట్రాఫిక్ పోలీసులు యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తూ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకులను బూతులు తిట్టిన ట్రాఫిక్ ఎస్సైపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువకులు పోలీసులకు ఎదురు తిరిగి నినాదాలు చేశారు.
వాహనదారులు యువకులకు మద్దతుగా నిలిచారు.
అదనపు సిబ్బందిని ఘటనా స్థలానికి తరలించారు.
ఉద్రిక్తత పెరగడంతో CI కిషోర్ వచ్చి యువకులకు క్షమాపణలు చెప్పారు.
యువకులు మాత్రం “మాకు బూతులు తిట్టిన CIపై చర్యలు తీసుకోవాలి” అంటూ డిమాండ్ చేస్తున్నారు.
“సోషల్ మీడియాలో మమ్మల్ని దోషులుగా చూపిస్తారేమో” అనే భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో చర్చనీయాంశంకాలర్ మైక్ వేసుకుని యూట్యూబర్లతో రీల్స్ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు…సేవా ధర్మం కంటే ప్రచారం కోసం ప్రవర్తిస్తున్నారా? అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి

