Tv424x7
Andhrapradesh

తెప్పోత్సవం రద్దు!!

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం దసరా రోజున నిర్వహించే తెప్పోత్సవం ఈ ఏడాది కూడా రద్దయింది.

కృష్ణా నదిలో వరదనీరు భారీగా చేరడంతో, భద్రతా కారణాల దృష్ట్యా నీటిపారుదల శాఖ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

గత రెండు సంవత్సరాల్లోనూ (2022, 2023) దసరా రోజు వర్షాల కారణంగా తెప్పోత్సవం జరగలేదు. ఈసారి వరదల నేపథ్యంలో భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, దసరా ఉత్సవాల భాగంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది.

👉 భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతున్నారు.

Related posts

ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్ప్రైస్ వీడియో

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల PPP పై విపక్ష–ప్రభుత్వ రచ్చ…. ఏంటో తెలుసా…

TV4-24X7 News

Leave a Comment