Tv424x7
Telangana

దసరా సీజన్‌.. టీఎస్ఆర్టీసీకి రూ.110 కోట్ల ఆదాయం..


బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కు మంచి ఆదాయం లభించింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగా సంస్థ రూ.110 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

యాజమాన్యం మొత్తం 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య అంచనాలకు తగ్గగా ఉండటంతో 5,300 బస్సులు మాత్రమే నడిపారు. ఈసారి 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేశారు.

గత ఏడాది ఇదే సీజన్‌లో రూ.114 కోట్ల ఆదాయం రాగా, ఈసారి కొంత తక్కువగా నమోదైంది. తిరుగు ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్‌ 5, 6 తేదీల్లో అదనపు బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Related posts

డిజిటల్ ప్రపంచంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి!

TV4-24X7 News

కొత్తగూడెం జిల్లాలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

TV4-24X7 News

చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

TV4-24X7 News

Leave a Comment