Report:కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో, మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడిన 19 ఏళ్ళ విశ్వతేజ్, 21 ఏళ్ళ సన్నీ అనే యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకులు ఈ దారుణాన్ని ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వలన వీడియో వైరల్ అయింది. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను రిమాండ్కు తరలించి, పోక్సో చట్టం కింద చర్యలు చేపట్టారు.

