పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటం వలన తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రేపటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశలో కదులుతుంది. గురువారం తెల్లవారుజామున ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించారు.
అక్టోబర్ 3న దక్షిణ ఒడిశా – ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే మూడు రోజులు తీరం వెంబడి 30 కి.మీ/గంట వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు అవసరమయిన జాగ్రత్తలు పాటిస్తూ, తీరప్రాంతంలో వాహన ప్రయాణాలు మరియు సముద్ర సంబంధిత కార్యకలాపాలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

