Tv424x7
Andhrapradesh

ఏపీలో కొత్త జిల్లాలు – వివాదాలు లేకుండా సాధ్యమేనా…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పు, సరిహద్దుల సవరణల ప్రతిపాదనలను ఖరారు చేసేందుకు సిద్ధమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమై ప్రతిపాదనలపై చర్చించనుంది.

తుది నివేదిక సిద్ధం చేసి నవంబర్‌ 7న జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.జనగణన కారణంగా ఈ ప్రక్రియను డిసెంబర్‌ 31 లోపు పూర్తి చేయాలని కేంద్రం సూచించింది.

టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలుఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఇందులో కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలు చేరే అవకాశం ఉంది.అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చే హామీ కూడా ఇవ్వబడింది.

రంపచోడవరం–చింతూరు డివిజన్లతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు కూడా ప్రతిపాదన ఉంది.రంపచోడవరం నుంచి ప్రస్తుత జిల్లా కేంద్రం పాడేరుకు 187 కిమీ దూరం ఉండటంతో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది.

అమరావతి కేంద్రంగా కొత్త జిల్లాపల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలతో అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై చర్చ జరుగుతోంది.

రాజధాని ప్రాంతానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ అవసరమన్న అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

అలాగే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధమవుతోంది.

10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు — వాటిలో అద్దంకి, మడకశిర ముఖ్యమైనవి.పరిపాలనా సౌలభ్యం కోసం ఒక నియోజకవర్గం ఒకే డివిజన్‌ పరిధిలోకి వచ్చేలా మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.—

వివాదాలు రాకుండా పూర్తి చేయగలరా?జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పుపై ఏడుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నుండి సుమారు 200 అర్జీలు అందాయి.

జిల్లా కలెక్టర్లు వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించారు.

అయితే, కొత్త జిల్లాల ఏర్పాటులో పేర్ల మార్పు లేదా సరిహద్దుల మార్పు ప్రతిపాదనలు వెలుగులోకి వస్తే రాజకీయ వాదోపవాదాలు చెలరేగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గతంలో కూడా సోషల్ మీడియాలో జిల్లాల పేర్ల మార్పు పై తీవ్ర చర్చలు జరిగిన విషయం తెలిసిందే

Related posts

జమ్మలమడుగులో వినాయక లడ్డూ పై వైఎస్ జగన్ పేరు ప్రతిష్టాత్మకం..

TV4-24X7 News

రేపు తహసిల్దార్ కార్యాలయంలో పి.జి.ఆర్.ఎస్ – తహసిల్దార్ ఉమారాణి

TV4-24X7 News

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

TV4-24X7 News

Leave a Comment