మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికలలో ప్రతి గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కోరడమైనది. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఏ క్షణమైన అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాన్ని తీరుస్తానని కార్యకర్తలకు భరోసాని ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి పాపినేని రాంబాబు కారపురెడ్డి సంజీవరెడ్డి, పొలిమేర రవీంద్ర రెడ్డి, తాహిర్ హుస్సేన్ ,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

previous post