Tv424×7( సిద్దిపేట జిల్లా స్టాపర్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం శ్రీరామకోటి భక్త సమాజం నిర్వహిస్తున్న గోటి తలంబ్రాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి భాగ స్వాములను చేస్తూ బుధవారం నాడు గజ్వేల్ సిఐ సైదా కూడా పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు గోటి తలంబ్రాలు గురించి వివరించారు. అనంతరం సిఐ సైదా చేతుల మీదుగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు గోటి తలంబ్రాలు అందజేశారు. భద్రాచల సీతారాములు కళ్యాణంలో పాలు పంచుకునే అవకాశం ఈ గోటి తలంబ్రాల వల్ల మాకు రావడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, ఎస్ఐ యాదగిరి, ఏఎస్ఐ పండరీ మరియు గోపాల్ గౌడ్, హెచ్ సి జగన్ మోహన్ రెడ్డి, అమరెందర్ పాల్గొన్నారు.

previous post