జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“ఈ రోజు విమోచన దినోత్సవం కాదు, విలీనం దినోత్సవం” అని స్పష్టం చేశారు.
రాజరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ సమైక్యమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేశారు.
సమైక్య పోరాట యోధుల త్యాగాలు, ఆత్మీయత, స్పూర్తి ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.
👉 తెలంగాణను ప్రజాస్వామ్య బాటలో నడిపిన వీరులను స్మరించుకుంటూ, వారి ఆలోచనలతో ముందుకు సాగుతామని కేటీఆర్ అన్నారు.

