‘భారత్లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. సింగపూర్లో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ KP.2 వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే దాని ప్రభావం దేశంలో లేవని, ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోనే ఈ కొత్త వేరియంట్లో దాదాపు 91 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
