Tv424x7
National

సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు… దీటుగా సమాధానం ఇచ్చిన భారత ఆర్మీ

జమ్ము: సరిహద్దులో పాకిస్తాన్‌ మరోసారి దుశ్చర్యకు ఒడిగట్టింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం(జూన్‌28) రాత్రి పాక్‌సైన్యం కాల్పులకు దిగింది.దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.క్రిష్టఘాటి సెక్టార్‌ వద్ద సరిహద్దు వద్ద భారత్‌వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండానే పాక్‌ సైన్యం కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. పాక్‌ సైన్యం జరిపిన ఈ కాల్పులకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చినట్లు సమాచారం. సరిహద్దు వెంట చొరబాటుదారులను పంపే సమయంలో దృష్టిని మరల్చడానికే పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీంతో చొరబాట్లను అడ్డుకోవడానికి సైన్యం అప్రమత్తమైంది.

Related posts

శస్త్రచికిత్స మధ్యలో వైద్యుడి అశ్లీల చేష్టలు….

TV4-24X7 News

రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి!!

TV4-24X7 News

గుడ్‌న్యూస్.. తగ్గనున్న పెట్రోెల్, డీజిల్ ధరలు!

TV4-24X7 News

Leave a Comment