ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఎస్ఈఎల్ సోలార్ కంపెనీ ఆసక్తి వ్యక్తం చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో పునరుత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. నార్వే, రష్యా, బ్రెజిల్, చైనా దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తల బృందం మంత్రిని కలిసి రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్యానళ్ల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.
