Tv424x7
Andhrapradesh

రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు..ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. ”ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం” అని కోదండరామ్‌ అన్నారు.

Related posts

వాడపల్లి బస్టాండ్ వద్ద హల్‌చల్… ఏంటో తెలుసా…

TV4-24X7 News

ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ క్లారిటీఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

TV4-24X7 News

డిప్యూటీ సిఎం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మహా యజ్ఞం

TV4-24X7 News

Leave a Comment