ఆంధ్రప్రదేశ్ : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయంది. శుక్రవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
previous post

