కడప/ మైదుకూరు :-కార్తీకమాసం అంటేనే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సహజం. అందులో చివరి సోమవారం కావడంతో కడప జిల్లా, మైదుకూరు మండలం, చిన్నయ్యగారి పల్లె సమీపంలోని ముక్కొండ క్షేత్రాన్ని దాదాపు 20 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు కొనసాగించారు. దాతల సహకారంతో ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. విజయ నగర సామ్రాజ్య కాలం నుండి ప్రసిద్దిగాంచిన కోలాటాలతో, భక్తుల శివనామ స్మరణతో ముక్కొండ క్షేత్రం మారుమ్రోగింది.


