Tv424x7
Telangana

కూకట్పల్లి సహస్ర హత్య కేసులో తాజా పరిణామాలు..

కూకట్పల్లిలో సంచలనం రేపిన సహస్ర హత్య కేసులో మైనర్ నిందితుడిని కస్టడీకి అనుమతిస్తూ జువెనైల్ కోర్టు నిర్ణయం తీసుకుంది.

నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులు అతన్ని జువెనైల్ హోమ్ లోనే విచారించారు.

విచారణ సమయంలోనే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అందించారు.

కస్టడీలో కూడా బాలుడు ఒకే మాట చెబుతున్నాడని పోలీసులు తెలిపారు – “క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేశాను” అని.

ఇప్పటికే బాలుడిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.

అరెస్ట్ అయినప్పటి నుండి నిన్నటికి బాలుడిలో మానసిక మార్పులు కనిపిస్తున్నాయి అని విచారణాధికారులు పేర్కొన్నారు.

👉 మొత్తం కేసు దర్యాప్తులో, బాలుడి మానసిక స్థితి, హత్య వెనుక ఉద్దేశ్యంపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Related posts

చేపపిల్లల పంపిణీ ఉందా.. లేదా..?సీజన్‌ మొదలైనా నిర్ణయం తీసుకోని సర్కారు

TV4-24X7 News

ఈటల రాజేందర్‌కు దారేది ?

TV4-24X7 News

పాఠశాల ఆహారంపై విద్యార్థినుల ఆందోళన…

TV4-24X7 News

Leave a Comment