Tv424x7
Telangana

ప్రాథమిక సహకార కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ..!

మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నిరసన తెలుపుతున్న హామలీలను ఎస్పీ ఆప్యాయంగా పలకరించి, రైతన్నకు కష్టకాలంలో అందరం తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.

అలాగే అధికారులు ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని, సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఎస్పీ చొరవతో హామలీలు తమ నిరసనను విరమించారు.

రజిత

Related posts

Rice Price: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!..

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన మధుయాష్కీ గౌడ్

TV4-24X7 News

తెలంగాణ-బంగాళాఖాతం మధ్య ఆవర్తన ద్రోణి: ఐఎండీ

TV4-24X7 News

Leave a Comment