Tv424x7
Andhrapradesh

అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన..

గుత్తి సమీపంలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి అమాయకపు ప్రాణం బాటిల్ మూత బారిన పడి క్షణాల్లో కరిగిపోయింది.

ఎన్పీటీసీ ట్రాన్స్‌కోలో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్న మౌనిక శుక్రవారం ఉదయం తన పనుల్లో నిమగ్నమై ఉండగా, ఇంట్లో ఆమె కుమారుడు రక్షిత్ రామ్ (1½ సంవత్సరం) ఆడుకుంటూ వాటర్ బాటిల్ మూతను పొరపాటున నోట్లో వేసుకున్నాడు. కాసేపటికే అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిల్లాడాడు. గమనించిన కుటుంబసభ్యులు అతన్ని తొందరగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల అన్ని ప్రయత్నాలు విఫలమై చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.

కుమారుడిని కోల్పోయిన మౌనిక కన్నీటి పర్యంతమై విలపించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, చిన్నారుల దగ్గర చిన్న వస్తువులు, బాటిల్ మూతలు, నాణేలు వంటి ప్రమాదకరమైన వస్తువులను వదిలిపెట్టవద్దని పెద్దలు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు.

Related posts

జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త శిబిరం

TV4-24X7 News

సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

TV4-24X7 News

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ఈసీ నీలం సాహ్ని

TV4-24X7 News

Leave a Comment