ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
యూరియా బస్తాలు కడిగేందుకు తల్లి భుజిబాయి (35) తన ముగ్గురు చిన్నారులతో కలిసి వాగుకు వెళ్లింది.
ఈ సమయంలో చిన్న కూతురు ప్రమాదవశాత్తు నీటిలో జారి పడింది.
కూతురిని కాపాడే క్రమంలో తల్లితో పాటు మరో ఇద్దరు పిల్లలు కూడా వాగులో కొట్టుకుపోయారు.
ఒక్కసారిగా జరిగిన ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లి, ముగ్గురు చిన్నారులు నీటిలో మృతి చెందారని నిర్ధారణ.

